Thursday, May 2, 2024
- Advertisement -

రాజశేఖరుడి బాధ ఎవరికైనా అర్ధమవుతుందా…

- Advertisement -

గరుడవేగ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న రాజశేఖర్ ఎంతో ఉద్వేగంతో ఉన్నాడు. వరుస దెబ్బలతో చిక్కిశల్యమైన రాజశేకర్ కు గరుడవేగ హిట్ అలాంటి ఇలాంటి విజయాన్ని ఇవ్వలేదు. ఈసినిమాతో జీవిత రాజశేఖర్ లు మేము ఇంకా ఫైట్ చేస్తామనే ధీమాకు వచ్చేశారు. తాజాగా జరిగిన ప్రెస్మీట్లో తాను ఇటీవల జీవితతో కలిసి చిరంజీవిని కలవడంపై మీడియాలో రకరకాల కామెంట్లు రావడంపై అసహనాన్ని వ్యక్తం చేశాడు.

తాను చిరంజీవితో కలవడం వలనే ‘గరుడవేగ’ ఆడుతోందని ఓ టీవీ ఛానెల్ చెప్పడాన్ని రాజశేఖర్ ఈ సందర్భంగా ప్రస్తావించాడు. అయితే ‘గరుడవేగ’ సినిమా విషయంలో చిరంజీవి తనని సపోర్ట్ చేశారని రాజశేఖర్ తెలిపాడు. రాజశేఖర్ కు ఇప్పటికి బుద్ధి వచ్చింది. అందుకే వెళ్లి చిరంజీవిని కలిశాడని కొందరు టీవీ ఛానల్లో రాస్తున్నారని … కాబట్టే సినిమా ఆడుతోందని అన్నారు. చాలామందికి తెలియని విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

చిరంజీవికి నాకు మనస్పర్ధలు ఎప్పుడో వచ్చాయని అవి అప్పుడే తొలగిపోయాయని అది తెలియకుండా చాలామంది ఏవేవో రాస్తున్నారని రాయడం కరెక్ట్ కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. మా మధ్య అపార్థాలన్నీ తొలగిపోయాయి. కొన్ని ఫంక్షన్లకు కలిసి వెళ్లాం కూడా. అయినా మేం ఆయన్ని కలిస్తే తప్పేంటి? మేం కలవకూడదా? దయచేసి మీడియా వాళ్లు మా మధ్య గొడవలు పెట్టకండి. అలాగే చిరంజీవి గారితో పాటు బాలకృష్ణ గారు కూడా మాకు ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆయనకు కూడా నా థ్యాంక్స్’’ అని రాజశేఖర్ ‘గరుడవేగ’ సక్సెస్ మీట్ లో అన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -