Friday, April 26, 2024
- Advertisement -

సొంత వారే.. రాజేంద్ర ప్రసాద్ ని ఆర్ధికంగా మోసం చేశారట!

- Advertisement -

నటకిరీటిగా టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న హీరో రాజేంద్రప్రసాద్. సహాయ నటుడిగా, హీరోగా.. ఆయన ఎన్నోచిత్రాల్లో నటించి తెలుగువారి మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు‌. ఎన్నో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన తెలుగు జాతి గర్వపడే నటుడు.

ఇక రీసెంట్ గా రాజేంద్ర ప్రసాద్ అనిల్ రావిపూడి నిర్మించిన “గాలి సంపత్ ” సినిమాలో నటించాడు. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఓ ముఖ్యమైన పాత్రని పోషించాడు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూ లో తనకు జరిగిన మోసం గురించి గుర్తు చేసుకున్నారు.

“నేను నటనారంగంలోకి ప్రవేశించిన సమయంలో ఏఎన్నార్‌, ఎన్టీఆర్‌, శోభన్‌బాబు, కృష్ణ తెలుగు ఇండస్ట్రీని ఏలుతున్నారు. అప్పుడు ప్రజల దృష్టిని ఆకర్షించాలంటే ఏదైనా స్పెషాలిటీ ఉండాలనుకున్నాను. దీంతో చార్లీ చాప్లిన్‌ సినిమాలు చూసి నాకంటూ ఓ స్టైల్‌ ఏర్పరుచుకున్నాను. అలా సినిమాలు చేసుకుంటూ పోయాను. కానీ ఒకానొక సమయంలో దగ్గరివాళ్లే నన్ను ఆర్థికంగా మోసం చేశారు.

నేను సంపాదించిందంతా ఊడ్చుకుపోయారు. నమ్మినవాళ్లే ఇంత దారుణంగా ఎలా మోసం చేస్తారని షాకయ్యాను” అని రాజేంద్రప్రసాద్‌ తెలిపాడు. చివరికి ఒక ఇల్లు తప్ప తనకు ఏమి మిగల్లేదని, కారణం ఎలాంటిదైనా కూడా అప్పుడు పెద్దగా బాధ పడలేదని తెలిపారు. కానీ జాగ్రత్తగా ఉండడం స్టార్ట్ చేసినట్లు చెబుతూ ప్రస్తుతం నేను అన్ని విధాలుగా హ్యాపీగా ఉన్నానని అన్నారు.

అవకాశాలు లేకున్నా అందంతో పిచ్చెక్కిస్తున్న హాట్ బ్యూటీస్ వీరే…!!!

బాలయ్యకు అవమానం.. గోబ్యాక్ అంటూ నినాదాలు!

క్యూట్ లుక్ తో పిచ్చెక్కిస్తున్న జాన్వీ కపూర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -