Sunday, May 19, 2024
- Advertisement -

షాక్‌లో సెన్సార్ ..చిట్టి ది అప్‌డెట్ వ‌ర్ష‌న్ చూస్తే….!

- Advertisement -

సూప‌ర‌స్టార్ ర‌జినీకాంత్ న‌టించిన 2.0 విడుద‌ల‌కు రెడీ అయింది.విజువ‌ల్ వండ‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాను మంగ‌ళ‌వారం సెన్సార్ పూర్తి చేసుకుంది.ద‌ర్శ‌కుడు శంక‌ర్ ఈ సినిమాను మూడు సంవ‌త్స‌రాలుకుపైగా తీశాడు.గ్రాఫిక‌ల్ వ‌ర్క్‌కు స‌మ‌యం ఎక్కువ ప‌ట్ట‌డం వల్ల సినిమా ఆల‌స్యం అయిందని తెలుస్తుంది.ఇక సినిమాలో విల‌న్‌గా న‌టించిన బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ క్యారెక్ట‌ర్ సినిమాకే హైలెట్ అని తెలుస్తుంది.

ఈ వ‌య‌స్సులో కూడా ర‌జినీ త‌న మార్క్ న‌ట‌న‌తో అల‌రించార‌ని సెన్సార్ చూసిన వారు చెబుతున్నారు.ఇక ఈ సినిమాలో హీరోయిన్ అమీ జాక్స‌న్ కూడా ఓ రోబో అని తెలుస్తుంది.ఈ సినిమాకు సెన్సార్ వారు యూఎఈ స‌ర్టిఫికేట్ ఇచ్చారు.ఇటీవ‌లే విడుద‌ల అయిన ట్రైల‌ర్‌కు విప‌రీత‌మైన స్పంద‌న వచ్చింది.ఇక ఈ సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ నెల 29న విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -