అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా రజనీకాంత్, అక్షయ్కుమార్ ప్రధాన పాత్రధారులుగా 2.0 సినిమా వస్తోంది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా రజనీకాంత్కు చివరి సినిమా అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా టీజర్ విడుదలకు ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకను హైదరాబాద్తో పాటు చెన్నైలో భారీ స్థాయిలో టీజర్ విడుదల కార్యక్రమం చేపట్టున్నారట. గతేడాది దుబాయ్లో ఫస్ట్లుక్, పాటల విడుదల కార్యక్రమానికి ప్రత్యేకంగా చేశారు.
టీజర్ విడుదల కోసం దక్షిణ భారత సూపర్ స్టార్స్తో పాటు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా హాజరవుతారంట. తెలుగు నుంచి చిరంజీవి – తమిళ్ నుంచి కమల్హాసన్ – మలయాళం నుంచి మమ్ముట్టి- మోహన్లాల్ ప్రత్యేక అతిథులుగా రాబోతున్నారు. కన్నడ నుంచి శివరాజ్ కుమార్ను పిలిచే అవకాశాలు ఉన్నాయి. వీళ్లంతా వయసుపరంగానే కాక సినిమాల పరంగా రజనీకి సమానమే. వీరందిరితో కలిసి సినిమా టీజర్ను విడుదల భారీ ఎత్తున చేయాలని చిత్రబృందం ప్లాన్.
ఏప్రిల్ 13 లేదా ఏప్రిల్ 27 టీజర్ విడుదల చేసే అవకాశం ఉంది. ఈ సినిమాలో అక్షయ్కుమార్ విలన్గా, అమీ జాక్సన్ హీరోయిన్ రోబో పాత్రలో నటిస్తుందని సమాచారం. అయితే ఈ సినిమాను వేసవిలో విడుదల చేయాలని అనుకుంటున్నారు. కానీ కుదరడం లేదు.