తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న చిత్రం 2.0.స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు రెడీ అవుతుంది.ఇప్పటికే విడుదల చేసిన టీజర్,ట్రైలర్కు మంచి స్పందన వచ్చింది.ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లు సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సినిమా తెలుగు వెర్షన్ నిడివి రెండు గంటల ఇరవై తొమ్మిది నిముషాలు. తమిళ వెర్షన్ దీనికంటే నిమిషం తక్కువ.ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను తొమ్మిది వేల థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1200 స్క్రీన్ లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూషన్ రంగంలో పేరు గాంచిన ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు, యువి వంశీ కలిసి ఈ సినిమా రిలీజ్ బాధ్యతలు తీసుకున్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఒక్క తెలుగు హక్కులే రూ.80 కోట్లకు అమ్ముడయ్యాయి. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ విలన్గా నటిస్తున్న ఈ సినిమా అమీ జాక్సన్ హీరోయిన్గా చేస్తుంది.ఇక ఈ సినిమా నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.