Sunday, April 28, 2024
- Advertisement -

లైంగిక దాడి చేయ‌కుండా ‘కింద’ తాళం వేయ‌మంటోన్న హాట్ బ్యూటీ ..!

- Advertisement -

బాలీవుడ్ సెక్సీ భామ రాఖీ సావంత్ సంచ‌లన కామెంట్స్ చేసింది.ప్ర‌స్తుతం ఇండియా మొత్తం షేక్ చేస్తున్న #మీటూ ఉద్య‌మం గురించి ఆమె మాట్లాడింది.దేశంలోని అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురికాకూడదంటే తనలా ‘కింద’ తాళాలు వేసుకోండని సూచించింది. రాఖీ సావంత్ త‌న ఇన్‌స్టాగ్రమ్‌లో ఓ వీడియోని పోస్ట్ చేసింది. రాఖీ సావంత్ #MeTooకు వ్యతిరేకంగా ఉంటూ వార్తల్లో ఉంటోంది. గతంలో కూడా రాఖీ.. కొన్ని వివాదాలను తనకు అనుకూలంగా మలుచుకుని వార్తల్లో ఉండేందుకు ప్రయత్నించింది.

ఈ వీడియోలో ఆమె తాను ఓ శాస్త్రవేత్త అని, అమ్మాయిలు లైంగిక వేధింపులు అత్యాచారాలకు గురికాకుండా ఉండేందుకు తాను ఓ వస్తువు కనిపెట్టానంటూ తన లోదుస్తులను, ప్రైవేట్ పార్ట్‌లను చైనులతో బంధించి తాళం వేసుకున్నట్లుగా చూపించింది. ఇలా తాళం వేసుకొంటే మహిళలు ఎక్కడైనా సేఫ్‌గా ఉంటారంటూ ఓ ఉచిత సలహా కూడా ఇచ్చేసింది. రాఖీ సావంత్ వీడియోపై హిళలు మండిపడుతున్నారు. రాఖీ సావంత్‌ చవకబారు వేషాలు వేస్తోందంటూ నెటిజన్లు ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఈ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -