Monday, May 6, 2024
- Advertisement -

అభిమానుల కోసం ర‌కుల్‌ప్రీత్‌సింగ్ వింత ప‌ని

- Advertisement -

అభిమానులతో ట‌చ్‌లో ఉంటేనే రాజ‌కీయ నాయ‌కుల‌కైనా.. సినీన‌టీన‌టుల‌కైనా భ‌విష్య‌త్ ఉండేది. వారిని ప‌ట్టించుకోకుంటే వారి కెరీర్ దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. అందుకే ఈ విష‌యాన్ని గ‌మ‌నించిన హీరోయిన్ ర‌కుల్‌ప్రీత్‌సింగ్ ఎవ‌రూ చేయ‌ని విధంగా ఓ వింత ప‌ని చేసింది. త‌న అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా ఉండాల‌ని.. వారితో త‌ర‌చూ సంప్ర‌దింపులు చేయాల‌నే ఆలోచ‌న‌తో త‌న పేరిట ఓ యాప్‌ను రూపొందించుకుని విడుద‌ల చేసింది. ఈ విధంగా త‌న పేరు మీద అభిమానుల కోసం యాప్ రూపొందించుకున్న మొద‌టి హీరోయిన్ ర‌కుల్ అయ్యిండొచ్చు.

ఈ యాప్‌ను హైద‌రాబాద్‌లో ర‌కుల్‌ప్రీత్ విడుద‌ల చేసి మాట్లాడింది. త‌న‌ అఫీషియల్‌ యాప్‌ను తేలికగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు అని తెలిపింది. రోజువారీ త‌న‌ అభిమానులు తమ ఫొటోలు, వీడియోలు పంపొచ్చు. ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసుకోవచ్చు. అభిమానుల సూచనలు, సలహాలతో మరింతగా నన్ను నేను మెరుగుపరచుకునే వీలు ఉంటుంద‌ని చెబుతోంది. ప‌లు పోటీలు నిర్వహించి అందులో గెలిచిన వారికి బహుమతులు ఇస్తాన‌ని తెలిపింది. దీంతో పాటు త‌న‌తో కలసి భోజనం చేసే, ప్రయాణించే అవకాశం ఉంద‌ని చెబుతోంది.న్యూయార్క్‌కు చెందిన ఎస్కేపెక్స్‌ టెక్నాలజీస్ ర‌కుల్‌ప్రీత్ యాప్‌ను రూపొందించింది. ఎస్కేపెక్స్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ షామిక్‌ తాలూక్‌దార్‌తో క‌లిసి ర‌కుల్ యాప్‌ను విడుద‌ల చేసింది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -