Monday, April 29, 2024
- Advertisement -

బాబాయ్ ప్రంసంగంపై ఫేస్ బుక్ లో రామ్ చరణ్ పోస్ట్…

- Advertisement -

టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. జ‌న‌సేన పార్టీని స్థాపించి నాలుగు సంవ‌త్స‌రాల త‌ర్వాత పార్టీ ఆవిర్భావ స‌భ‌ను ఘ‌నంగా నిర్వ‌హించింది. టీడీపీ ప్ర‌భుత్వం, చంద్ర‌బాబు పాల‌న‌పై ప‌వ‌న్ విరుచుకుప‌డిన సంగ‌తి తెల‌సిందే. బాబు పాల‌న‌లో జ‌రుగుతున్న ప్ర‌జా వ్య‌తిరేక‌పాల‌న‌, ఇసుక‌మాఫియా, ప్ర‌భుత్వఅధికారుల‌పై దాడులు వివిధ అంశాపై ప‌వ‌న్ త‌న‌దైన శైలిలో ఏకిపారేశారు.

చంద్రబాబు, లోకేశ్‌పై ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేతలు మండిపడుతున్న తరుణంలో హీరో రామ్ చరణ్ ప‌వ‌న్‌కు మ‌ద్ద‌తుగా ఓ పోస్ట్ చేశాడు. అది ఇప్పుడు సోషియ‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తోంది. జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో తన బాబాయ్ పవన్ కల్యాణ్ చేసిన ప్రసంగం అద్భుతంగా ఉందంటూ కితాబిచ్చాడు.

ఉత్తేజ పరిచేలా, నిజాయతీగా ఉన్న గొప్ప ప్రసంగం!! భవిష్యత్తులో నైనా రాష్ట్రానికి మంచి జరుగుతుందని ఆశిద్దాం..’ అని తన ఫేస్ బుక్ పోస్ట్ లో పేర్కొన్న రామ్ చరణ్, జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతున్న ఓ ఫొటోను జతపరిచాడు.

ఈ పోస్ట్ పై నెటిజన్లు భిన్న వ్యాఖ్యలు చేశారు. ‘నిజం చెప్పాలంటే మొట్టమొదటసారిగా పీకే హృదయపూర్వకంగా మాట్లాడారు. బాగా అనిపించింది’, ‘నువ్వు సినిమాలపై ఏకాగ్రత పెట్టు. మెగా, పవర్ స్టార్ ల లెగెసీని ముందుకు తీసుకెళ్లు. చరిత్ర సృష్టించేందుకే రాజకీయాలపై పీకే దృష్టి పెట్టారు’ అనే వ్యాఖ్యలతో పాటు పవన్ కల్యాణ్ ని విమర్శిస్తూ మరికొన్ని వ్యాఖ్యలను నెటిజన్లు చేయడం గమనార్హం.

https://www.facebook.com/AlwaysRamCharan/photos/a.298908460257547.1073741830.177773979037663/992040800944306/?type=3

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -