- Advertisement -
ఇటీవల రిలీజ్ అయిన రంగస్థలం,భరత్ అను నేను సినిమాలు హిట్ అయ్యాయి.కాని ఈ రెండు సినిమాల కలెక్షన్ల విషయంలో మాత్రం ఇద్దరు నిర్మాతలు పోటీపడి మరి కలెక్షన్లు ప్రకటించారు. ఈ విషయంలో అప్పుడే చాలమంది ప్రశ్నించారు కూడా.కాని తాజాగా ఈ కలెక్షన్లపై స్పందించారు హీరో రామ్ చరణ్.ఇక మీద తన సినిమాల కలెక్షన్స్ ప్రకటించుకోవడానికి తను వ్యతిరేకం అని ప్రకటించాడు నటుడు రామ్ చరణ్.
వంద కోట్ల రూపాయలు వచ్చాయి, రెండు వందల కోట్ల రూపాయలు వచ్చాయని అంటూ ప్రకటించుకుంటున్నారు. ఆ మేరకు పోస్టర్లు విడుదల చేస్తున్నారు. హీరోలందరం బాగానే ఉంటామని ఫ్యాన్స్ కూడా అదేవిధాంగా ఉండలని కోరుకుంటామని తెలిపాడు రాంచరణ్.మా మధ్య ఆరోగ్యకరమైన పోటి ఉందని తెలిపాడు హీరో రాంచరణ్.