రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమా ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిట్టిబాబుగా రామ్ చరణ్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిధా అయ్యారు. ఈ సినిమా నాన్ బాహుబలి రికార్డుగా నిలిచింది. ఇక తాజాగా ఈ సినిమా మరో రికార్డు బ్రేక్ చేసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న సుదర్శన్ 35 ఎంఎం సినిమా హాల్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది.
మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ పేరిట ఉండగా, దాన్ని ‘రంగస్థలం’ బ్రేక్ చేసింది. 12 సంవత్సరాల క్రితం విడుదలైన పోకిరి, సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో రూ.1,61,43,081 వసూలు చేసింది. ఇక రంగస్థలం విడుదలైన 89 రోజుల్లో రూ. 1.62 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డును సృష్టించింది.అయితే పోకిరి టైంలో టిక్కెట్ ధరలు చాలా తక్కువుగా ఉన్నాయి.రంగస్థలం సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించాడు.సమంత హీరోయిన్గా నటించింది.