Wednesday, May 15, 2024
- Advertisement -

రంగ‌స్థ‌లంనుంచి రోండో పాట‌…తీన్మార్ చిందులే…

- Advertisement -

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ నటించిన రంగస్థలం నుంచి రెండో సాంగ్‌ వచ్చేసింది. రంగా.. రంగా… రంగస్థలానా రంగుపూసుకోకున్నా… అంటూ సాంగే మాస్‌ బీట్‌ను కాసేపటి క్రితం మేకర్లు విడుదల చేశారు. పూర్తిగా సాంప్రదాయ సంగీత వాద్యాలతో స్వరపరిచిన ఈ జానపదపాట శ్రోతలను ఉర్రూతలూగిస్తుంది.

దర్శకుడు సుకుమార్ ఈ చిత్రాన్ని 1985 కాలం నాటి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన ఈ సినిమాలో జగపతిబాబు, ఆది, అనసూయ కీలకపాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎరినేని, రవిశంకర్ ఎరినేని, మోహన్ చెరుకూరి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న విడుదల కానుంది.

వినబడేట్లు కాదు రా.. కనబడేట్లు కొట్టండహే అంటూ చెర్రీ వాయిస్‌ ఓవర్‌ తో ఊర మాస్‌ బీట్‌ సాంగ్‌ను దేవీ అందించాడు. రంగస్థలం ఊరు నేపథ్యంలో సాగే ఈ పాటలో చెర్రీ స్టైలింగ్‌ కూడా వైవిధ్యంగానే ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -