క్రాక్ హిట్తో మళ్లీ ఫామ్లోకి వచ్చాడు మాస్ మహారాజ రవితేజ. ప్రస్తుతం రవితేజ రెమ్యునరేషన్ కూడా భారీగానే తీసుకుంటున్నట్టు టాక్. ఇదిలా ఉంటే క్రాక్ తర్వాత చాలా సినిమాలకు ఓకే చెప్పిన రవితేజ.. ప్రస్తుతం ఖిలాడీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కరోనాతో ఆగిపోయింది. మళ్లీ జూలై 15 నుంచి పున: ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రమేశ్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. రమేశ్ వర్మ గత చిత్రం రాక్షసుడు సక్సెస్ అయిన విషయం తెలిసిందే.
ఖిలాడీ కూడా భారీ యాక్షన్ సినిమాగా తెరకెక్కుతోంది. రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్, యాంకర్ అనసూయ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత రవితేజ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. జూలై 15 నుంచి హైదరాబాద్లో ఈ మూవీకి సంబంధించి కొంత పార్ట్ షూట్ చేయబోతున్నారు. ఆ తర్వాత దుబాయ్లో కీలక సన్నివేశాలు తెరకక్కిస్తారట.
ఖిలాడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ టీజర్ సైతం ప్రేక్షకులను అలరించింది. గతంలో రవితేజ.. రమేశ్ వర్మ కాంబినేషన్లో వీర చిత్రం వచ్చింది. ఈ చిత్రం పెద్దగా వసూళ్లు రాబట్టలేదు. అయినప్పటికీ మరో చాన్స్ ఇచ్చాడు మాస్ మహారాజ.
కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.
Also Read