Sunday, May 5, 2024
- Advertisement -

దుబాయ్​లో ‘ఖిలాడీ’..

- Advertisement -

క్రాక్​ హిట్​తో మళ్లీ ఫామ్​లోకి వచ్చాడు మాస్​ మహారాజ రవితేజ. ప్రస్తుతం రవితేజ రెమ్యునరేషన్​ కూడా భారీగానే తీసుకుంటున్నట్టు టాక్​. ఇదిలా ఉంటే క్రాక్​ తర్వాత చాలా సినిమాలకు ఓకే చెప్పిన రవితేజ.. ప్రస్తుతం ఖిలాడీ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ షూటింగ్​ కరోనాతో ఆగిపోయింది. మళ్లీ జూలై 15 నుంచి పున: ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు రమేశ్​ వర్మ తెరకెక్కిస్తున్నాడు. రమేశ్​ వర్మ గత చిత్రం రాక్షసుడు సక్సెస్​ అయిన విషయం తెలిసిందే.

ఖిలాడీ కూడా భారీ యాక్షన్​ సినిమాగా తెరకెక్కుతోంది. రవితేజ సరసన డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా నటిస్తున్నారు. ఈ మూవీలో అర్జున్​, యాంకర్ అనసూయ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత రవితేజ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్​ మ్యూజిక్​ అందిస్తున్నాడు. జూలై 15 నుంచి హైదరాబాద్​లో ఈ మూవీకి సంబంధించి కొంత పార్ట్​ షూట్​ చేయబోతున్నారు. ఆ తర్వాత దుబాయ్​లో కీలక సన్నివేశాలు తెరకక్కిస్తారట.

ఖిలాడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ టీజర్​ సైతం ప్రేక్షకులను అలరించింది. గతంలో రవితేజ.. రమేశ్​ వర్మ కాంబినేషన్​లో వీర చిత్రం వచ్చింది. ఈ చిత్రం పెద్దగా వసూళ్లు రాబట్టలేదు. అయినప్పటికీ మరో చాన్స్​ ఇచ్చాడు మాస్​ మహారాజ.
కోనేరు సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

Also Read

రాకీభాయ్​తో మిల్కీబ్యూటీ రొమాన్స్​.. !

ఏ సినిమా విడుదల ఎప్పుడు? అంతా గందరగోళమే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -