పాకిస్థాన్లో ప్రతి చిన్న విషయానికి హత్యలు చేస్తుంటారు.చిన్న పిల్లలు, ఆడవాళ్లు అని కూడా చూడరు చంపేస్తుంటారు.పాకిస్థాన్లో రీసెంట్గా నటులపై కూడా దాడులు జరిగాయి.పాకిస్థాన్ నటులు ఇండియా సినిమాలలో నటిస్తే చాలు వారి పై దాడికి తెగపడేవారు. కాని పరిస్థితి మారిపోయింది.దాడులు మానేసి చంపటం మొదలెట్టారు. ముఖ్యంగా లేడి ఆర్టిస్టులపై కొంత మంది ఉన్నతాధికారుల ఆధిపత్యం కొనసాగుతోంది. వారు చెప్పినట్లు చేయకుంటే దాడికి దిగుతున్నారు. రీసెంట్ గా అదే తరహాలో ఒక యువ గాయకురాల్ని తీవ్రంగా గాయపరచి కొందరు ఉన్నత వ్యక్తులు చంపేశారు.
పాకిస్తాన్ లో పాస్తో అనే భాషలో వచ్చే టివి సీరియల్స్ లో నటిస్తూ అలాగే సినిమాల్లో గాయనిగా కొనసాగుతున్న సుంబుల్ ఖాన్ ను అతి దారుణంగా చంపేశారు. ఒక ప్రముఖ ఈవెంట్ లో పాల్గొనాలని ఆమెను కోరగా ఆమె ఒప్పుకోలేదు. దీంతో వెంటనే ముగ్గురు వ్యక్తులు ఆమెపై దాడి చేశారు. అయితే తీవ్ర గాయాలతో ఆ యువతీ కొద్దీ సేపటికే మరణించింది. పాకిస్తాన్ ఆర్మీ కి సంబందించిన వ్యక్తులే ఆమెను చంపారని తెలుస్తోంది.