- ఆడియో విడుదలలో సాయిధరమ్ తేజ్
తాను ఈ స్థాయికి చేరడానికి కారణం తన ముగ్గురు మావయ్యలు (చిరంజీవి, పవన్కల్యాణ్, నాగబాబు) అని, వారి ఇంటి ముందు జవాన్లా నిలబడతానని యువ నటుడు సాయిధరమ్ తేజ్ ప్రకటించాడు. తనకు ధైర్యంగా ఉండడం నేర్పించి తాననొక జవాన్గా తయారు చేసింది మావయ్య పవన్కల్యాణ్ అని తెలిపాడు. తాను నటించిన జవాన్ సినిమాపాటల విడుదల కార్యక్రమం హైదరాబాద్లో సందడిగా నిర్వహించారు. తొలి సీడీని దర్శకుడు వీవీ వినాయక్ విడుదల చేశారు. ఈ జవాన్ సినిమాను దిల్రాజు సమర్పణలో వస్తోంది. కార్యక్రమంలో హీరోయిన్ మెహ్రీన్, దర్శకులు విజయేంద్రప్రసాద్, సతీష్ వేగేశ్న, మారుతి, హరీష్ శంకర్.ఎస్, బాబీ, కరుణాకరన్, బన్నీ వాసు, బాబీ, గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి, నిర్మాతలు డి.వి.వి.దానయ్య, బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, జె.భగవాన్, జె.పుల్లారావు, కె.వి.గుహన్, బ్రహ్మ కడలి తదితరులు పాల్గొన్నారు.
సుప్రీమ్ తర్వాత ఈ సినిమాపై సాయిధరమ్ తేజ్ పూర్తి నమ్మకంతో ఉన్నాడు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన నక్షత్రం పరాజయం చెందడంతో తేజ్ ఈ సినిమాపై బాగా అంచనాలు పెట్టుకున్నాడు. కాగా ఈ సినిమాలో ధరమ్ తేజ సరసన మెహ్రీన్ నటిస్తోంది. వాంటెడ్ దర్శకుడు బీవీఎస్ రవి దర్శకత్వం వహిస్తున్నాడు. కృష్ణ నిర్మాత. తమన్ స్వరాలు అందిస్తున్నాడు. భాస్కరభట్ల, కె.కె., శ్రీమణి సాహిత్యం అందించారు. ఈ చిత్రం డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.