ఫిదా సినిమాతో తెలుగు ఆడియెన్స్ను ఫిదా చేసింది హీరోయిన్ సాయిపల్లవి.ఈ సినిమాతో తెలుగులో ఆమెకు మంచి క్రేజ్ ఏర్పరుచుకుంది.ఆ తరువాత ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర హిట్లుగా నిలిచాయి.కాకపోతే హీరోలను తెగ ఇబ్బంది పెడుతుందని రూమర్స్ సాయి పల్లవిపై చాలానే ఉన్నాయి.హీరో శర్వానంద్తో కూడా ఈమెకు ఏదో గొడవ జరిగినట్లు వార్తలు వచ్చాయి.ఈ విషయంలో క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి.ఈ విషయంపై పక్కన పెడితే తాజాగా ఆమె ఓ హీరోని రిజెక్ట్ చేసిందని వార్తలు వినిపిస్తున్నాయి.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవల ‘సాక్ష్యం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ హీరో చేతిలో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దర్శకుడు తేజతో ఓ సినిమా చేస్తుండగా కొత్త దర్శకుడితో మరో సినిమాకు సైన్ చేశాడు.ఒక సినిమాలో కాజల్ను హీరోయిన్ తీసుకున్నాడు సాయి శ్రీనివాస్.మరో సినిమాలో హీరోయిన్గా సాయి పల్లవిని తీసుకోవాలని భావించారు.దాని కోసం ఆమెకు రూ.2కోట్లు ఆఫర్ చేశారు. కానీ సాయి పల్లవి మాత్రం రెమ్యునరేషన్ చూసి టెంప్ట్ అవ్వకుండా సినిమా చేయనని నిర్మొహమాటంగా చెప్పేసిందట. అతని పక్కన నేను నటిస్తే తనకు లాభం కాని తన కెరీర్కు ఎటువంటి ఉపయోగం ఉండదని భావించి ఈ సినిమాను సాయి పల్లవి రిజెక్ట్ చేసిందని సమాచారం.