Saturday, May 18, 2024
- Advertisement -

‘సాక్ష్యం’ టీం న‌న్ను మోసం చేసింది :పూజా హెగ్డె

- Advertisement -

‘మాస్క్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది పూజా హెగ్డె.ఈ సినిమా ఫెయిల్ అయిన‌ప్ప‌టికి వ‌ర‌స సినిమాల‌తో బిజీ హీరోయిన్‌గా మారింది.తెలుగులో ముకుందా,ఒక లైలా కోసం సినిమాలు ఫెయిల్ కావ‌డంతో బాలీవుడ్ బాట ప‌ట్టింది.అక్క‌డ కూడా పూజాకు నిరాశే ఎద‌రైంది.దీంతో మ‌ళ్లీ తెలుగు సినిమాలు చేస్తుంది.దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఈ సినిమాలో పూజా అందాల‌కు జ‌నాలు ఫిదా అయ్యారు.ఈ విష‌యం ప‌క్క‌న పెడితే… పూజా హెగ్డె తాజాగా న‌టించిన చిత్రం ‘సాక్ష్యం’.ఈ సినిమా గ‌త వార‌మే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది.’సాక్ష్యం’పై మిక్స్‌డ్ టాక్ విన‌బ‌డుతుంది.దీంతో క‌లెక్ష‌న్స్ కూడా పెద్ద‌గా ఏం లేవ‌ని తెలుస్తుంది.ఇక సాక్ష్యం సినిమాలో పూజా యాక్టింగ్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు విన‌బ‌డుతున్నాయి.

ఆమె మేక‌ప్ కూడా ఏం బాలేద‌నే కామెంట్స్ వినిపించాయి.ఈ సినిమా ఫ‌లితంపై పూజా స్పందించింది.అస‌లు ఈ క‌థ విన‌గానే పూజా రిజ‌క్ట్ చేసింద‌టా.కాని ఆమెని బ‌ల‌వంత‌గా ఈ సినిమాకు ఒప్పించార‌ని స‌మాచారం.ఇది మామూలు సినిమా కాదని ఇండస్ట్రీ హిట్ అవుతుందని, రెమ్యునరేషన్ కూడా పెద్ద మొత్తంలో ఇస్తున్నారని ఆమెని నమ్మించి ఓకే చేయించారట.తీరా చూస్తే సినిమా ఫ‌లితం రివ‌ర్స్ అవ‌డం,హీరో క‌న్నా హీరోయిన్ న‌ట‌న‌పైనే ఎక్కువ కామెంట్స్ రావ‌డంతో సాక్ష్యం టీం నన్ను మోసం చేశార‌నే భావ‌న‌తో పూజా హెగ్డె ఉంద‌ని తెలుస్తుంది.ఇక మీద ఇలాంటి మాట‌లు న‌మ్మి సినిమాలు చేయ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంద‌టా పూజా.ప్ర‌స్తుతం పూజా హెగ్డె తెలుగు టాప్ హీరోలంద‌రితోను న‌టిస్తుంది.మ‌హేశ్ బాబు,ఎన్టీఆర్‌,ప్ర‌భాస్ సినిమాల‌లో హీరోయిన్‌గా చేస్తుంది పూజా.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -