దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఎంతగా చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రతిరోజూ నాలుగు లక్షల వరకు కేసులు నమోదు అవుతున్నాయంటే దీని ప్రభావం ఎంత ఘోరంగా ఉందో అర్థం అవుతుంది. కరోనా కాటుకు సామాన్యులే కాదు.. సెలబ్రెటీలు వరుసగా కన్నుమూస్తున్నారు. తాజాగా కన్నడ దర్శకుడు నవీన్(36) కరోనాతో బాధపడుతూ సోమవారం కన్నుమూశారు.
ఇటీవల ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు. ‘వన్ డే ఇన్ 2011’ సినిమాతో పరిచయమై.. మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నవీన్. అప్పు వెంకటేష్, రేవన్న ఈ సినిమాలో నటించారు.
తాజాగా రెండో సినిమాకు కథ సిద్ధం చేసుకుంటున్న తరుణంలోనే కరోనా ఈయన్ని కాటేసింది.పిన్నవయస్సులోనే నవీన్ చనిపోవడంతో ఆయన కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నవీన్ మృతిపై పలువురు శాండల్ వుడ్ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.
కొత్తూరు మున్సిపాలిటీ లో ఎగిరిన గులాబీ జెండా