టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ తాజా చిత్రం ‘సిటీమార్’ కబడ్డీ నేపథ్యంలో సంపత్నంది దర్శకత్వంలో రానున్న మూవీలో మిల్క్ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 2 న విడుదల కావాల్సింది. ప్రస్తుతం కరోనా కారణంగా సినిమాను విడుదల చేసే పరిస్థితి లేదు. కనుక సినిమాను ఓటీటీలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నాడట చిత్ర నిర్మాత శ్రీనివాస చిట్టూరి.
హీరోగా గోపీచంద్ కు, దర్శకునిగా సంపత్ నంది కి ఈ మూవీ ఎంతో కీలకం. ఇండస్ట్రీలో వీరిద్దరూ మంచి విజయాన్ని అందుకొని చాలాకాలం అయింది. కాబట్టి వీరిద్దరికీ ఈ సినిమా థియేటర్ లోనే రిలీజ్ చేసి తన సత్తాను నిరూపించుకోవాలన్న అభిప్రాయంలో ఉన్నారట. తాజా సమాచారం ప్రకారం ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ హక్కులను ఓ ప్రముఖ సంస్థ కొనుగోలు చేసి ఈ నెల ఆఖర్లో ఓటీటీలో సినిమా విడుదల చేయాలని నిర్ణయించిందట.అయితే ఈ విషయంపై అధికారికంగా ఎవరూ స్పందించలేదు.
Also read:అనుపమ రిజెక్ట్ చేసిన సూపర్ హిట్ చిత్రాలు ఇవే!
ప్రస్తుతం గోపీచంద తేజ దర్శకత్వంలో ‘అలిమేలుమంగ వేంకటరమణ’ అనే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. అలాగే దర్శకుడు మారుతి గోపిచంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘పక్కా కమర్షియల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.ఈ సినిమాలో రాశిఖన్నా,ఈషా రెబ్బ ఇద్దరు హీరోయిన్లుగా నటిస్తున్నారని సమాచారం.
Also read:పవన్ కళ్యాణ్ అలా అంటే నాకు ఇష్టం… షాకింగ్ వ్యాఖ్యలు చేసిన వర్మ!