Sunday, May 5, 2024
- Advertisement -

సీన్ కోసం ట్రైన్ నుంచి దూకిన సాయి పల్లవి

- Advertisement -

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను భానుమతి ఫుల్ ఫిదా చేస్తోంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ కన్న సాయి పల్లవికి ఎక్కువ క్రేజ్ వచ్చింది. భానుమతి పాత్రలో సాయి పల్లవి జనాల మనసులను దోచేసుకుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మకు ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ జనాల్లో హాట్ టాపిక్ సాయి పల్లవి. కేవలం టాలీవుడ్ వారే కాదు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆమె నటన మరియు సినిమాలో ఆమె మాట్లాడిన తెలంగాణ యాసను మెచ్చుకున్నారు.

ఆమెకు తెలంగాణ చరిత్రకు సంబంధించిన ఓ పుస్తకాన్ని కూడా బాహుమతిగా ఇచ్చారు. సాయి పల్లవి గురించి శేఖర్ కమ్ముల.. ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ.. ఆమెను ఆడిషన్ లో చూడగానే తానే నా భానుమతి అని ఫిక్స్ అయ్యాను అని చెప్పాడు. ఆమె ఈ సినిమా కోసం చాలా కష్టపడింది అని రన్నింగ్ ట్రైన్స్ ఎక్కడం దిగడం అలాగే ట్రాక్టర్ నడపడం వంటి చాలా పనులు డూప్ లేకుండా తానే సొంతగా చేసింది అని చెప్పుకొచ్చారు.

ఇంటర్వెల్ సీన్ లో ఆమె నిజంగానే ట్రైన్ నుండి కింద పడిపోయింది అంట, వరుణ్ తో మాట్లాడి కోపం లోభానుమతి ట్రైన్ దిగేసి ఏడుస్తూ కూర్చుంటుంది అయితే ట్రైన్ వెళ్లిపోతుంటే మల్లి పరిగెత్తుకుంటూ రన్నింగ్ ట్రైన్ ఎక్కాల్సి ఉంటుంది ఆ సీన్ చేసే ప్రయత్నంలో ఆమె కింద పడిపోయి మోకాళ్ళకు బాగా దెబ్బ తగిలిందట. అందువల్ల ఆ సీన్ ని సినిమాలో పెట్టలేకపోయాము అని శేఖర్ కమ్ముల చెప్పుకొచ్చారు. ఈ రోజు ఆమెను తెలుగు ప్రజలు ఇంతగా అభిమానిస్తున్నారు అంటే అది తాను పడిన కష్టమే అని శేఖర్ కమ్ముల సాయి పల్లవి గురించి చెప్పారు. ఏది ఏమైన మనల్ని ఫిదా చేయడం కోసం.. సాయి పల్లవి చాలా కష్టపడింది.

https://www.youtube.com/watch?v=ZIU-EhAfq_Y

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -