ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజురోజుకు కేసులు అధికంగా పెరుగుతున్నాయి. అయితే మనలోనే సాధారణ ప్రజల నుంచి ఎన్నికల వరకు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ముఖ్యంగా సినిమా రంగానికి చెందిన సెలబ్రిటీలు ఈ మహమ్మారి బారిన పడి కొందరు కోలుకోగ మరికొందరు మృత్యువాత పడ్డారు.
తాజాగా ఈ మహమ్మారి బారిన పడి అలానాటి నటి మాలా శ్రీ భర్త, ప్రముఖ నిర్మాత కొణిగల్ రాము కరోనా కారణంగా మృత్యువాత పడ్డాడు. కన్నడలో కొణిగల్ రాము హై బడ్జెట్ నిర్మాతగా మంచి పేరును సంపాదించుకున్నారు.ఏకే47, లాకప్ డెత్, సీబీఐ తదితర సినిమాలను ఆయన నిర్మించారు. ఇక మాలాశ్రీ కి తెలుగులో విజయశాంతి ఉన్నంత గుర్తింపు ఆమెకు ఉంది.
గత కొన్ని రోజుల క్రితం కొణిగల్ రాముకు కరోనా వైరస్ వ్యాపించడంతో అతను బెంగుళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. అయితే సోమవారం అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈయన మరణవార్త కన్నడ ఇండస్ట్రీనీ మొత్తం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈయన మృతి పట్ల సినీ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
అల్లు అర్జున్ పుష్ప సినిమాలో మరో బ్యూటీకి అవకాశం..