అర్జున్ రెడ్డి సినిమాలో హీరోకు విజయ్ దేవరకొండకు ఎంత పేరు వచ్చిందో హీరోయిన్ షాలిసి పాండేకు కూడా అంతే మంచి పేరు వచ్చింది.చాలామంది షాలిని యాక్టింగ్కు ఫ్యాన్స్ అయిపోయారు.ప్రస్తుతం షాలినికి మంచి ఆఫర్స్ అందుతున్నాయి. కోలీవుడ్లో కూడా మొదటి అవకాశాన్ని అందుకుంది. సావిత్రి బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే.షాలిని సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో చకర్లు కొడుతుంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో కూడా నటించే అవకాశం షాలిని పాండేకు వచ్చిందనే వార్త హల్ చల్ చేస్తుంది.
మహేష్ తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఒకే చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమాలో పూజ హెగ్దే హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. మరో హీరోయిన్గా షాలిని పాండేను తీసుకుంటున్నారని తెలుస్తుది. ఇది నిజమే అయితే షాలినికి అదృష్టం కలిసి వచ్చినట్లే.ప్రస్తుతం మహేష్ భరత్ అనే నేను సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ నెల 20న భరత్ అనే నేను సినిమా రిలీజ్ కాబోతోంది.ఈ సినిమా రిలీజ్ తరువాత మహేష్ బాబు 25 సినిమా మొదలు కానుంది.