‘ఓయ్` హీరోయిన్ మళ్లీ సినిమాల్లోకి..
బాలనటిగా నటించి మెప్పించిన ఓ అమ్మాయి హీరోయిన్గా అడుగుపెట్టింది. ఆ తర్వాత మళ్లీ తెరపై కనిపించ లేదు. ఇప్పుడు ఎనిమిదేళ్ల విరామం తర్వాత మళ్లీ హీరోయిన్గా మేకప్ వేసుకుంది. మళ్లీ తెలుగు తెరపై కనిపించబోతోంది. బాలనటిగానే బోలెడంత మంది అభిమానుల్ని సంపాదించుకున్న షామిలి ‘ఓయ్` తర్వాత మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
తొలి సినిమా నిరాశపరచడంతో ఉన్నత చదువులు కోసం కెరీర్కి దూరమైంది. తర్వాత ఓ మలయాళ, ఓ తమిళ సినిమా చేసిన షాలినీ మరోసారి తెలుగు తెరపై వస్తుందంట. ఆమె హీరోయిన్గా ‘అమ్మమ్మగారిల్లు` సినిమా తెరకెక్కుతోంది. నాగశౌర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమాను సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా కనిపిస్తోంది. ‘అమ్మమ్మగారిల్లు’ అనే టైటిల్ చాలా క్యాచీగా ఉంది. అమ్మమ్మగారింటితో ప్రతీ ఒక్కరికీ ఉండే అనుబంధంపై ఈ సినిమా తీస్తున్నారని సమాచారం. వేసవిలో ఈ సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.