- Advertisement -
వరుస సక్సెస్లతో దూసుకుపోతున్న యంగ్ హీరో శర్వానంద్.కెరీర్ స్టార్టింగ్లో విభిన్న కథలతో తనకంటు ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించకున్నాడు శర్వా.తరువాత కాలంలో కమర్షియల్ సినిమాలు చేస్తు విజయాలు సాధించాడు.చాలాకాలం తరువాత మరో ప్రయోగాత్మక చిత్రానికి రెడీ అవుతున్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ డిఫరెంట్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా రెడ్ లైట్ ఏరియా నేపథ్యంలో తెరకెక్కనుందని తెలుస్తోంది.
యంగ్ జనరేషన్ హీరోల్లో ఇంత వరకు ఇలాంటి నేపథ్యంతో ఎవరూ సినిమా చేయకపోవటంతో సుధీర్,శర్వాల సినిమాలపై ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం శర్వానంద్ పడి పడి లేచే మనసు సినిమా షూటింగ్లో బిజిగా ఉన్నాడు ఈ సినిమా పూర్తి అవగానే సుధీర్ వర్మ సినిమా మొదలు పెడతాడు.ఈ సినిమాలో హీరోయిన్గా కల్యాణీ ప్రియదర్శన్ పేరును పరిశీలిస్తున్నారు.