రాంచరణ్ హీరోగా సమంత హీరోయిన్గా నటించిన రంగస్థలం అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదలకు రెడీగా ఉంది.ఈ సినిమాకు కన్ఫ్యూజన్ డైరక్టర్ సుకుమార్ దరకత్వం వహిస్తున్నారు.విలేజ్ బ్యాక్ డ్రాప్తో సినిమా తెరకెక్కినట్లు టీజర్, ట్రైలర్ను చూస్తే తెలుస్తుంది. ఈ సినిమా విలేజ్లో జరిగే ఎలక్షన్ డ్రామాగా తెరకెక్కినట్లు వినికిడి.రాంచరణ్ అన్నయ్యగా ఆది పినిశేట్టి చేస్తున్నాడు.ఆది ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్దిగా నటిస్తున్నాడు. ఆ ఎన్నికలలో జరిగిన గొడవలో ప్రత్యర్దులు ఆదిని చంపేస్తారు. అన్నయ్య మరణానికి కారణం అయిన వాళ్లు ఎవరో తెలుసుకొని వారిపై ప్రతీకారం తీర్చకొవడం…. ఇది ఓవర్ఆల్గా రంగస్థలం స్టోరీ.ఈ కథకు సుకుమార్ తన టేకింగ్ను యాడ్ చేసి చాలా రిచ్గా తీశాడు.కాని ఎవరు ఊహించని ట్వీస్ట్తో సినిమా ఎండ్ అవుతుందని మనకు తెలిసిన సమాచారం.
సినిమా క్లైమాక్స్లో రాంచరణ్ చనిపోతాడు.అవును మీరు విన్నది నిజమే సినిమా చివర్లో చిట్టిబాబు చనిపోతాడంటా.ప్రత్యర్దుల చేతిలో చిట్టిబాబు చివరి భాగంలో చనిపోతేనే సినిమా అందరికి కనెక్ట్ అవుతుందని సుకుమార్ చెప్పడంతో చరణ్ కూడా కాదనలేకపోయాడు. కానీ…….. దీనికి చిరంజీవి ఒప్పుకొలేదని తెలుస్తుంది.అందరు కలిసి కన్విన్స్ చేస్తే రాంచరణ్ చనిపోయినట్లు చూపించకుండ అందరికి అర్ధం అయ్యేలా చివర్లో రాంచరణ్ ఫోటో వేసి సినిమా ఎండ్ వచ్చేలా చేయలని చిరు చిత్ర యూనిట్ను కోరాడు అని తెలుస్తుంది.దీనికి చిత్ర బృందం కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. ఏదీ ఏమైనా రంగస్థలంలో రాంచరణ్ క్యారెక్టర్ చనిపోతాడనే వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.