ప్రభాస్ కోసం శ్రద్ధా కపూర్ రావడం ఏంటీ అనుకుంటున్నారా? ఏం లేదండీ …ప్రభాస్ ప్రస్తుతం సాహో సినిమాతో బిజీగా ఉన్నాడు.ఈ సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ నటిస్తుంది.ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన మేజర్ షెడ్యూల్ ను దుబాయ్ లో పూర్తి చేశారు.. కొన్ని రోజుల పాటు విరామం తీసుకున్న ఈ సినిమా టీమ్, తాజా షెడ్యూల్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేసింది.ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరించనున్నారు.
ఈ రోజు నుంచి మొదలవుతోన్న ఈ షెడ్యూల్లో పాల్గొనడానికి శ్రద్ధా కపూర్ కూడా వచ్చింది. శ్రద్ధా కపూర్ కి తెలుగులో ఇది తొలి సినిమా. ప్రభాస్ వంటి స్టార్ హీరో సరసన తెలుగులో పరిచియమవడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తుంది శ్రద్ధా.ఈ సినిమాకు రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈసినిమాను వచ్చే సమ్మర్ బరిలో నిలపలని భావిస్తున్నారు చిత్ర యూనిట్.