మెగాస్టార్ చిరంజీవి …కొడుకు రామ్ చరణ్తో నటించిన హీరోయిన్లతో రొమాన్స్ చేయడానికి ఎటువంటి మొహమాటం పోవడం లేదు. రామ్ చరణ్తో మూడు సినిమాలు చేసిన కాజల్ అగర్వాల్తో కలిసి ఖైదీ 150 సినిమా చేశాడు చిరంజీవి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఈ సినిమా తరువాత చిరు సైరా మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా తమన్నాను పెట్టుకున్నప్పటికి , మెయిన్ హీరోయిన్గా మాత్రం నయనతారను తీసుకున్నారు. ఈ సినిమా తరువాత కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నాడు చిరంజీవి. ఈ సినిమాలో హీరోయిన్గా శృతి హాసన్ను ఎంపిక చేసినట్లు సమాచారం.
గతంలో కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు సినిమాలో నటించింది.ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. శృతి హాసన్ కూడా రామ్ చరణ్తో కలిసి ఎవడు సినిమాలో నటించింది. మెగా ఫ్యామిలీ హీరోలందరితో కలిసి నటించింది శృతి హాసన్. బన్ని ,పవన్ కల్యణ్, రామ్ చరణ్ , ఇప్పుడు చిరంజీవితో నటించడం ద్వారా మెగా హీరోలను మొత్తాన్ని కవర్ చేసిన హీరోయిన్గా నిలవనుంది శృతి హాసన్. కొరటాల అడిగిన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట శృతి హాసన్. సైరా మూవీ పూర్తి కాగానే కొరటాల శివ మూవీని మొదలుపెడతాడు.
- Advertisement -
చిరంజీవితో రొమాన్స్కు రెడీ అంటోన్న శృతి హాసన్
- Advertisement -
Related Articles
- Advertisement -
Most Populer
- Advertisement -
Latest News
- Advertisement -