Thursday, March 28, 2024
- Advertisement -

శ్రీమంతుడు గాయకుడికి విడాకులు కావాలట

- Advertisement -

సాధారణం గా ఎవరైనా విడాకులకు అప్లయ్ చేసినా, లేదా తీసుకుంటున్నా కానీ అంత ఆసక్తి ఉండదు కానీ ఎందుకో సెలబ్రిటీలు విడాకులు తీసుకొని తమ వైవాహిక జీవితానికి ఫుల్ స్టాప్ పెడుతున్నారు అంటే మీడియా ఎనలేని ఆసక్తి ని కనబరుస్తుంది. ఇప్పుడు తాజా గా సింగర్ రఘు దీక్షిత్ విడాకులకు అప్లయ్ చేసిన అంశం అంతటా ఆసక్తి ని క్రియేట్ చేస్తుంది.

అయితే కన్నడ సినిమా పరిశ్రమ లో మొదటగా కెరీర్ ని మొదలు పెట్టిన రఘు దీక్షిత్ క్రమక్రమం గా దక్షిణాది లో మిగిలిన భాషల్లో కూడా పాటలు పాడి ఆపై హిందీ లో కూడా గాత్రం అందించాడు.అయితే అతను పాపులర్ డ్యాన్సర్‌ మయూరి ని వివాహమాడాడు. ఇప్పుడు ఈ సెలబ్రిటీ జంట విడాకులు కోసం బెంగళూరు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేశారు. ఇలా విడాకులు తీసుకోవడానికి కారణం ఏంటి అనేది తెలియదు కానీ మీడియా కథనాల ప్రకారం రఘు దీక్షిత్‌ పై మీటూ ఆరోపణలు వచ్చిన దగ్గర నుండి ఈ జంట మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి అని, అప్పటి నుంచే విడాకుల కోసం ప్రయత్నిస్తున్నారు అని, చివరికి ఇప్పుడు ఇలా నిర్ణయం తీసుకున్నారు అని సమాచారం.

శ్రీమంతుడు లో జాగో, జనతా గారేజ్ లో రాక్ ఆన్ బ్రో, సన్ ఆఫ్ సత్యమూర్తి లో చల్ చలో చలో పాటలు రఘు దీక్షిత్ ఆలపించినవే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -