Thursday, April 18, 2024
- Advertisement -

నా జీవితంలో మాయని గాయం అంటూ అసలు విషయాన్నీ చెప్పిన సింగర్ సునీత!

- Advertisement -

ప్రస్తుతం దేశంలో కరోనా సెకండ్ వేవ్ కారణంగా నిత్యం వేల సంఖ్యలో మరణాలు, లక్షల సంఖ్యలో కేసులు వస్తుండడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనికితోడు ఆక్సిజన్ కొరత, మందుల కొరత వంటి కారణాలతో ప్రజలు మానసికంగా ఒత్తిడికి లోనవుతున్నారు. దేశ ప్రజలను ఆదుకోవడానికి ఇప్పటికే ఎంతో మంది ముందుకొచ్చారు.

తాజాగా సింగర్ సునీత తనకు చేతనైన పాటతో ప్రజా సేవ చేయడానికి సిద్ధమవుతోంది.ఇందులో భాగంగా సింగర్ సునీత ఎవరికీ చేతనైనా సాయం వారు చేయాలని కోరుతూ తనకు తెలిసింది పాటలు పాడటమే అందుకే ప్రతీ రోజూ రాత్రి ఎనిమిది గంటలకు సింగర్ సునీత లైవ్ లో తన అభిమానులతో ముచ్చటిస్తూ అభిమానులు అడిగిన పాటలను ఆలపిస్తూ అభిమానుల్లో మానసిక ప్రశాంతతను,ఉత్సాహాన్ని నింపుతున్నారు.

Also read:ఆర్ఆర్ఆర్ ఆపండి.. మహేష్ తో సినిమా మొదలెట్టండి అంటూ రాజమౌళిపై ఒత్తిడి!

ఈక్రమంలో గత మూడు రోజులుగా ప్రతీ రోజూ అర్ధగంట అంటూ రాత్రి ఎనిమిది గంటలకు లైవ్‌ లోకి సునీత ఎంట్రీ ఇస్తున్నారు. ఇంకాస్త టైం పెంచొచ్చు కదా? అని అభిమానులు సునీతను రిక్వెస్ట్ చేస్తున్నారు. అలాగే తన భర్త రామ్‌తో కలిసి లైవ్‌లోకి రండి అంటూ అడుగుతున్నారు.నిన్న లైవ్ సందర్భంగా ఓ అభిమాని మీ ముఖం పై గాయం ఎందుకు తగిలింది అని అడగగా సునీత నుదురు మీద ఉన్న గాయం గురించి చెబుతూ తన చిన్ననాటి విషయాలను గుర్తుకు చేసుకున్నారు. చిన్నతనంలోనే ఆ ప్రమాదం జరిగిందని, ఐదారు కుట్లు పడ్డాయని, ఆ తీపి గుర్తులు ఇంకా గుర్తున్నాయని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు గాయని సునీత.

Also read:పార్వతి మెల్టన్ ఇప్పుడు ఎక్కడ ఉంది?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -