- Advertisement -
యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. తన యాంకరింగ్తో వేలాది అభిమానులను సంపాదించుకుంది.ఫోటో షూట్లతో ఎప్పుడు హల్ చల్ చేస్తుంటుంది శ్రీముఖి. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే శ్రీముఖి మొన్న ఆ మధ్య వచ్చిన రంగస్థలం సినిమాలోని రంగమ్మ మంగమ్మ పాటను తన హవభావలతో ఓ వీడియోని తన ట్వీట్టర్లో పోస్ట్ చేసింది. ఈ వీడియో బాగానే వైరలైంది.
ఇప్పుడు మరోసారి సోషల్ మీడియా ముందుకు వచ్చింది శ్రీముఖి . ఈసారి సాంగ్తో కాకుండా ఓ ఫోటోతో అభిమానుల ముందుకు వచ్చింది. ఈ ఫోటోలొ అచ్చం మహనటి సావిత్రిగారిలా ఉంది. ‘గుండమ్మ కథలో సావిత్రి’ అంటూ టాగ్ తగిలించి ఈ ఫొటోల్ని తన ట్విట్టర్లో పోస్ట్ చేసుకుంది.ఈ ఫోటో చూసిన కొందరు మహనటి సినిమాలో కీర్తి సురేష్ కన్నా శ్రీముఖి అయితే చాలా బాగుండేదని అభిప్రాయపడుతున్నారు.