శ్రీరెడ్డి.. ఈ పేరే సంచలనాలకు కేరాఫ్ అడ్రస్. కాస్టింగ్ కౌచ్ వివాదంతో వెలుగులోకి వచ్చిన ఈ హాట్ బ్యూటీ.. నగ్నంగా నిరసన తెలిపి చిత్రపరిశ్రమలో సంచలనంగా మారింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్పై తీవ్ర విమర్శలు చేసి పెను దుమారం లేపింది. ఇలా చిత్ర పరిశ్రమలో పలువురి ప్రముఖులను టార్గెట్ చేయడంతో ఆమె మరింత పాపులర్ అయిపోయింది.
తరచూ ఏదో ఒక అంశంపై స్పందిస్తూ నిలిచే శ్రీరెడ్డి.. తాజాగా మెగా డాటర్ నిహారికపై సంచలన వ్యాఖ్యలు చేసింది. నిహారిక పెళ్లి ఈ నెల 9న రాజస్తాన్లోని ఉయద్పూర్ ప్యాలెస్లో జరిగింది. ఆమె పెళ్లికి సంబంధిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా బాగా వైరల్ అయ్యాయి. దీనిపై శ్రీరెడ్డి స్పందిస్తూ..‘ఊళ్లో పెళ్లికి కుక్కల హడావిడి లాగా.. నాగబాబు కూతురు పెళ్లికి మీరంతా ఎందుకు పిసుక్కుంటున్నారా? యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు పవన్ వచ్చాడు.. డ్యాన్స్ చేశాడు.. ఇవే కనిపిస్తున్నాయి.మీడియా కూడా ఆమె పెళ్లినే హైలెట్ చేస్తుంది. ఏదైనా ఉపయోగపడే పనులు చేయండిరా? రైతులు రోడ్ల మీదకు వస్తున్నారు. తమిళనాడులో ఓ అమ్మాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. పాపం అలాంటివి ఫోకస్ చేయండి. ఇకనైనా మారండిరా బాబు. పనికిరాని వెదవల్లారా. నేనన్నది మీడియా వాళ్లను కాదు.పెళ్లిళ్లను చూసి పిసికేసుకుంటున్న వారిని’అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
కాగా, శ్రీరెడ్డి మొదటి నుంచి మెగా ఫ్యామిలీపై తీవ్ర విమర్శలు చేస్తుంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్, చిరంజీవి, నాగబాబులను దారుణంగా ట్రోల్ చేస్తుంది. వాళ్ల సినీ కెరీర్తో పాటు రాజకీయ అంశాలపై విమర్శలు చేస్తూ పలుమార్లు వార్తల్లోకెక్కింది.