టాలీవుడ్ వివాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి తన మాటలకు పని పెట్టింది. కాస్టింగ్ కౌచ్పై తీవ్ర పోరాటం చేసింది శ్రీరెడ్డి. తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు రావలంటే పడుకోవలని సంచలన ఆరోపణలు చేసింది శ్రీరెడ్డి.నిర్మాత సురేష్ బాబు కొడుకు అభిరామ్ తనకు సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి తనని లైంగికంగా వాడుకున్నాడని చెప్పి సంచలనానికి తెర లెప్పింది. ఆ తరువాత పాలిటిక్స్ లో భాగంగా పవన్ పై వ్యక్తిగత విమర్శలు చేసి ఊహించని విధంగా నెగిటివ్ కామెంట్స్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడంలో శ్రీరెడ్డిని పట్టించుకోవడం మానేశారు.దీంతో కోలీవుడ్కి షిప్ట్ అయి ,అక్కడ కూడా సినీ ఇండస్ట్రీకి చెందిన వారిపై ఆరోపణలు చేయడం మొదలు పెట్టింది.తాజాగా మహానటి సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్పై సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ చేసింది శ్రీరెడ్డి .
హీరో విశాల్- కీర్తి సురేష్ జంటగా నటించిన పందెం కోడి-2 సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ జరిగింది .ఈ ఫంక్షన్లో విశాల్ మాట్లాడుతు శ్రీరెడ్డి గురించి ప్రస్తావించారు.విశాల్ శ్రీరెడ్డి గురించి స్పందిస్తు…ఆమెతో పని చేసేవారు కాస్త జాగ్రత్తగా ఉంటె మంచిది. శ్రీ రెడ్డి వివాదాలకు దూరంగా ఉంటూ అవకాశాలు దక్కించుకోవడం మంచి పరిణామం. కాకపోతే ఆమెతో ఉన్నవారు సేఫ్టీగా కెమెరాలను ఉంచుకోవడం బెటర్. అలా ఉంటె శ్రీ రెడ్డికి కూడా ఆటోమేటిక్ గా రక్షణ కల్పించినట్లే అని విశాల్ పేర్కొన్నారు. దీంతో అక్కడ ఉన్నవారందరు నవ్వేశారు.ఆ వేధికపైనే ఉన్న సినిమా హీరోయిన్ కీర్తి కూడా నవ్వింది.అంతే కీర్తిపై మండిపడుతుంది శ్రీరెడ్డి.. కీర్తి సురేష్ నవ్వును చుసిన తరువాత అసహ్యం వేసింది. నీ టైమ్ బావుందని మేఘాల్లో తేలుతున్నావ్. ఇండస్ట్రీలో ఎప్పుడు ఒకేలా ఉంటుంది అనుకోకు. స్ట్రగులర్స్ బాదేంటో ఎదో ఒకరోజు నీకు తెలుస్తుంది. నువ్వు నవ్విన వెకిలి నవ్వును నేను ఎప్పటికి మరచిపోలేనని శ్రీ రెడ్డి వివరించారు. మరి విశాల్ మాట్లాడిన దానిలో శ్రీరెడ్డికి ఎక్కడ తప్పుగా కనిపించిందో ఎవరికి అర్థం కావడం లేదు.