Saturday, April 27, 2024
- Advertisement -

పవన్ తో మూవీ.. సాయి పల్లవి పారితోషికం ఎంతో తెలుసా?

- Advertisement -

తన డాన్స్‌, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన హీరోయిన్ సాయి పల్లవి. ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించడం తన ప్రత్యేకం. ‌నటిగా ద‌క్షిణాదిలో ఆమెకున్న డిమాండ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఫిదా చిత్రంతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ని ద‌క్కించుకుని స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. ‌ప్రస్తుతం సాయి పల్లవి అక్కినేని నాగచైతన్య సరసన, ఫిదా డైరెక్టర్ తెరకెక్కించి లవ్ స్టోరీ సినిమాలో నటించింది.అంతేకాకుండా రానా విరాటపర్వంలో కూడా సాయిపల్లవి నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.

తాజాగా ఈ నాచురల్ బ్యూటీ అయ్యప్పనుమ్ కోషియుమ్‌ రీమేక్‌లో పవన్ కళ్యాణ్ భార్యగా నటించడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది. అయితే ఈ పాత్రని పోషించడానికి భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. రూ.2 కోట్ల రెమ్మునరేషన్ డిమాండ్ చేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత పెద్ద మొత్తానికి నిర్మాతలు ఓకే చెప్పాకే సంతకం చేసిందట.

సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నఈ యాక్షన్ డ్రామాలో రానా కూడా న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. రానాకు జోడీగా ఐశ్వర్య రాజేష్ కనిపించనుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ మూవీకి పవన్ స్నేహితుడు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే – డైలాగ్స్ అందిస్తున్నారు.

అనసూయ డిమాండ్‌ మాములుగా లేదుగా..

టాలీవుడ్ లో వీరి జోడీ సూపర్ హిట్..!

మన సెలబ్రిటీస్ లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారో చూడండి..!

గందరగోళం సృష్టించండి. అధికారులను భయపెట్టండి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -