Friday, April 26, 2024
- Advertisement -

లెజండ‌రీ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో… ఫోటో వైరల్!

- Advertisement -

గత ఏడాది నుంచి ప్రపంచ వ్యాప్తంగా కరోనా బీభత్సం ఎంతగా కొనసాగుతుందో అందరికీ తెలిసిందే. కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా సినీ ఇండస్ట్రీపైనే పడింది. దాంతో సినీ నటులు ఇంటికే పరిమితం అయ్యారు. ఈ క్రమంలో సోషల్ మాద్యమాల్లో తమ జ్ఞాపకాలను ఫ్యాన్స్ షేర్ చేస్తున్నారు. పాత ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. 33 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా విజయ బాపినీడు దర్శకత్వంలో రూపొందిన ఖైదీ నెం.786 సూపర్ డూపర్ హిట్ అందుకుంది.

ఆ సినిమా సక్సెస్ వేడుక సందర్బంగా విజయ బాపినీడు, చిరంజీవిలను అభినందించేందుకు గాను కృష్ణ‌,కృష్ణంరాజు, శోభ‌న్ బాబు ఆ కార్య‌క్ర‌మానికి వ‌చ్చారు. అప్పట్లో దర్శకుడు విజయబాపినీడు స్టార్లుగా వెలిగిపోతున్నకృష్ణ‌,కృష్ణంరాజు, శోభ‌న్ బాబు లతో ఎంతో సాన్నిహిత్యం ఉండేదట.. ఈ నేపథ్యంలోనే ఖైదీ నెం.786 సక్సెస్ వేడుకకు పిలవగానే వచ్చారట.

ఆ సమయంలో ఖైదీ నెం.786 సక్సెస్ వేడుకకు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నట్లు సమాచారం. 1988 జూన్ 10న విడుదల అయిన ఖైదీ నెం.786 సినిమా చిరంజీవి సరసన భానుప్రియ హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రల్లో మోహన్ బాబు ఇంకా కోట శ్రీనివాసరావు సత్యనారాయణ నూతన్ ప్రసాద్ లు నటించారు. ఈ మూవీ పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ లెజండ‌రీ స్టార్స్ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

కరోనాతో ప్రముఖ కన్నడ నటుడు సురేష్ చంద్ర కన్నుమూత

ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

నేటి పంచాంగం, శనివారం (12-06-2021)

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -