- Advertisement -
దర్శకుడు సుకుమార్తో హీరో నితిన్ ఓ సినిమా చేయనున్నాడు. అయితే ఈ సినిమాకు సుకుమార్ కేవలం కథను మాత్రమే అందిస్తున్నారు.సుకుమార్ గతంలో కూడా తన కథలను వేరే దర్శకులకు ఇచ్చి సినిమాలు చేయించాడు.యూత్ కి నచ్చేలా కథాకథనాలను సిద్ధం చేయడంలో సుకుమార్ సిద్ధహస్తుడు. . ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలన్నీ ఈ విషయాన్ని నిరూపించినవే. ఆయన కథను అందించిన ‘కుమారి 21 ఎఫ్’ ఘన విజయాన్ని సాధించింది.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ‘కుమారి 21 ఎఫ్’ను తెరకెక్కించిన సూర్యప్రతాప్ ఈ సినిమాకి దర్శకుడు. ఈ సినిమాలో హీరోగా నితిన్ చేయనున్నాడని తెలుస్తుంది.త్వరలోనే కథానాయిక ఎంపిక జరగనుంది. గోపీసుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు.సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేస్తామని చిత్ర యూనిట్ తెలిపింది.