మెగాస్టార్ చిరంజీవి డాటర్స్ ఇద్దరూ వివాదాలకూ చాలా దూరంగా ఉంటారు. వార్తలకూ, ఇంటర్వ్యూలు వంటివి అసలు ఉండవు. అయితే ఈ మధ్య చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఫ్యాషన్ డిజైనర్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మిస్ యూనివర్స్ లాంటి పోటీలకు జడ్జ్ గా వెళ్లటం అంటే మాములు విషయం కాదు. అయితే ఇప్పుడు సుస్మితా ఈ మధ్య ఒక వివాదం గురించి స్పందించింది. సుస్మితా ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మను టార్గెట్ చేస్తూ ఒక ఇంటర్వ్యూలో కామెంట్స్ చేయడం హాట్ న్యూస్ గా మారింది.
వర్మ ట్విట్టర్ ద్వారా చేసే కామెంట్స్ను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని అంటూ లంచ్ బ్రేక్ లో మాట్లాడుకోవడానికి తప్ప ఆ కామెంట్లు ఎందుకూ పనికి రావని అంటూ సెటైర్లు వేసింది సుస్మిత. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్విట్ల విషయంలో మెగా ఫ్యామిలీ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తమ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ వర్మ చేసిన ఈ ట్వీట్లపై మెగాస్టార్ చిరంజీవి కూతురు సుస్మిత ఓ ఇంటర్వ్యూలో స్పందించింది.
వర్మ ట్విట్టర్ ద్వారా చేసే కామెంట్లను సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదని, లంచ్ బ్రేక్లో మాట్లాడుకోవడానికి తప్ప ఆ కామెంట్లు ఎందుకూ పనికి రావని, ఖాళీ టైంలో వర్మ ట్వీట్లు చూసి నవ్వుకుంటామని, ఒకరు మాట్లాడే మాటలను మనం నియంత్రించలేమని సుస్మిత చెప్పింది. అందరికి మాట్లాడే స్వేచ్చ ఉన్నా.. కంప్లీట్ గా నెగిటివ్ గా మాట్లాడే వారిని సామాజిక మాధ్యమాల నుండి బ్లాక్ చేయాలని తన అభిప్రాయం తెలిపింది. సుష్మిత చెప్పిన విధంగానే కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. పెళ్లైన కూతురును పెట్టుకొని పోర్న్ వీడియోలు చూసే అతని గురించి ఏం మాట్లాడుతామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
Related