#మీటూ ఉద్యమం తార స్థాయికి చేరుకుంది.టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు మొత్తం దీని గురించే చర్చించుకుంటున్నారు.ఇండస్ట్రీలో మహిళలు తము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో #మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. తెలుగులో కూడా ఇప్పటికే పలువురు మహిళలు ఇండస్ట్రీలో తమకు జరిగిన అన్యాయంపై స్పందించడం జరిగింది.అయితే టాలీవుడ్లో ఇంకా బయటికి రాని పేర్లు చాలానే ఉన్నాయాని తెలుస్తుంది.నటీమణులు కొందరు సాంకేతిక నిపుణులు తమపై జరిగిన వేధింపుల గురించి ఎలా బయటపెట్టాలనే విషయంపై మాట్లాడడానికి యాంకర్ సుమ, మరో యాంకర్ ఝాన్సీ, లేడీ డైరెక్టర్ నందిని రెడ్డితో కలిసి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. మరణించిన నటులు, దర్శకులు, నిర్మాతలపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయకూడదని నిబంధన పెట్టుకున్నట్లు సమాచారం.
చనిపోయిన వ్యక్తులు సమాధానాలు చెప్పలేరు కాబట్టి వారిపై ఆరోపణలు చేయడం సరికాదని భావిస్తున్నారు. తమ యాంకరింగ్ చేసే సమయలలో తమకు ఎదురైన లైంగిక ఆరోపణలు గురించి బయట పెట్టే పనిలో పడ్డారు ఈ ఇద్దరు యాంకర్స్.వారి దగ్గర ఇండస్ట్రీకి చెందిన చాలా పెద్ద వ్యక్తుల పేర్లు ఉన్నట్లు తెలుస్తుంది.వాటిని బయటపెట్టాడానికి ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు యాంకర్ సుమ, మరో యాంకర్ ఝాన్సీ.దీంతో వీరిని ఇబ్బంది పెట్టిన వారు తమ ఎక్కడ చెబుతారో అని భయంతో వణికిపోతున్నారు.వారు ఇప్పటికే కొందరితో రాయభారాలు కూడా నడుపుతున్నట్లు తెలుస్తుంది.ఏది ఏమైనప్పటికి #మీటూ ఉద్యమం టాలీవుడ్లో కూడా ప్రకంపనలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది.