మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగులో సంపత్ నంది దర్శకత్వంలో “సీటీమార్”అనే సినిమాలో తెలంగాణ కబడ్డీ కోచ్ జ్వాల రెడ్డి పాత్రలో నటిస్తోంది. తమన్నా ఈ మూవీలో తెలంగాణ యాసతో డబ్బింగ్ చెప్పడం విశేషం. తర్వాత సూపర్ హిట్ హిందీ చిత్రం. “అంధా ధున్” కి తెలుగు రీమేక్ “మాస్ట్రో”లోను అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న “ఎఫ్ 3” మూవీలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో ప్రస్తుతం బిజీ స్టార్ గా కొనసాగుతోంది.
తమన్నా తాజాగా నటించిన వెబ్ సిరీస్ “నవంబరు స్టోరీస్”. ఇందులో తమన్నా అనురాధా గణేశన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో స్టార్ హీరోయిన్ శృతిహాసన్ తో ఉన్న స్నేహం గురించి కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు ఎప్పుడు బాధ కలిగిన, ఆనందం కలిగిన మొదట ఫోన్ చేసేది శ్రుతికే అంటూ వారిద్దరి మధ్య స్నేహబంధాన్ని గుర్తు చేసుకుంది తమన్నా.
Also read:అడిగిందంతే.. వరలక్ష్మి శరత్ కుమార్ కోసం కదిలిన తారలు..?
ఈ సందర్భంగా తమన్నా శృతిహాసన్ గురించి మాట్లాడుతూ శృతిహాసన్ చాలా సరదాగా, ఎంతో ఆప్యాయంగా అందర్నీ పలకరిస్తూ ఉందని. అలాగే తాను ఒంటరిగా ఉంటూ కష్టపడి కెరీర్ను కొనసాగిస్తుంటుంది.అందుకే నేను తన నుంచి స్ఫూర్తి పొందుతా అని తమన్నా పేర్కొంది. ఇద్దరు స్టార్ హీరోయిన్స్ అయినప్పటికీ వీరి మధ్య స్నేహం కొనసాగడం చాలా గొప్ప విషయమే అని చెప్పాలి. ఎందుకంటే ఇద్దరూ సెలబ్రెటీలు స్నేహంగా ఉండడం అనేది అరుదుగా జరుగుతుందంటూ పలువురు నెటిజెన్స్ వీరిద్దరిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Also read:హోల్ సెల్ గా అభిమానులను బురిడీ కొట్టించిన డాక్టర్ బాబు?