Thursday, May 2, 2024
- Advertisement -

టాలీవుడ్ అంతా ముంబాయ్ బాట‌

- Advertisement -

కిట‌కిట‌లాడుతున్న శంషాబాద్ విమానాశ్ర‌యం

అందాల న‌టి దివికేగ‌డంతో భార‌త సినీ ప‌రిశ్ర‌మ దిగ్ర్భాంతికి గుర‌య్యింది. అంత‌టి అందాల న‌టి మ‌రెవ‌రూ రార‌ని ఘంటాప‌థం చెబుతున్నారు. ఆమె న‌ట‌న.. అందం ఎవ‌రికీ రాద‌ని ఆమె లేని లోటు ఎవ‌రూ తీర్చ‌లేర‌ని శోక‌త‌ప్తానికి గుర‌వుతున్నారు. అందుకే ఆమె మ‌ర‌ణించార‌ని తెలిసినా లేదు ఆమె చావ‌లేద‌ని భావిస్తున్నారు. ఆమెకు మ‌ర‌ణం అంటూ లేద‌ని.. ఆమె దేవ‌క‌న్యగా భావిస్తున్నారు. ఆమె మ‌ర‌ణించారంటే ఇప్ప‌టికీ ఎవ‌రూ న‌మ్మ‌డం లేదు. అయితే తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో ఆమె అగ్ర తార‌గా వెలుగొందారు. ఆకు చాటు పిందె త‌డిసే అని సీనియ‌ర్ ఎన్టీఆర్‌తో శోభ‌న్‌బాబుతో ఎల్లువ‌చ్చి గోదార‌మ్మా అంటూ.. కృష్ణ‌తో ఎన్నో పాట‌లు.. ఇక చిరంజీవితో అబ్బ‌నీ తీయ‌ని దెబ్బ ఇలా ఎన్నో అజ‌రామ‌ర‌మైన పాట‌ల్లో న‌టించి చాలా సినిమాల్లో న‌టించారు. అయితే ఆమె మ‌ర‌ణం టాలీవుడ్‌కు తీర‌ని లోటుగా మిగిలింది.

ఇప్పుడు ఆమెతో న‌టించిన న‌టీన‌టులు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లు, రాజ‌కీయ నాయ‌కులు, ప్ర‌ముఖులు, నాయ‌కులు ఆమెను గుర్తు చేసుకుంటున్నారు. ఆమెను క‌డ‌సారి చూద్దామ‌ని ముంబాయ్‌కు ప‌య‌న‌మ‌వుతున్నారు. టాలీవుడ్ ప్ర‌ముఖులు ముంబాయికి త‌ర‌లివెళ్తుండ‌డంతో హైద‌రాబాద్ శంషాబాద్ విమానాశ్ర‌యం కిట‌కిట‌లాడుతోంది. విమానాల రాక‌పోక‌ల‌తో విమానాశ్ర‌యం బిజీగా ఉంది.  శ్రీదేవిని తెలుగు తెర‌కు ప‌రిచ‌యం చేసిన ద‌ర్శ‌కుడు కే. రాఘ‌వేంద్ర‌రావు, అత్య‌ధికంగా శ్రీదేవితో న‌టించిన హీరో కృష్ణ‌, ఆ త‌ర్వాత చిరంజీవి, మోహ‌న్‌బాబు, రామ్‌గోపాల్ వ‌ర్మ‌, అక్కినేని నాగార్జున, వెంక‌టేశ్‌, బాల‌కృష్ణ‌, సుమ‌న్‌, విజ‌య‌శాంతి, ర‌మ్య‌కృష్ణ‌, అలీ, టీ. సుబ్బిరామిరెడ్డి ఇలా సీనియ‌ర్ న‌టులు, ద‌ర్శ‌కులు, నిర్మాతలు త‌ర‌లివెళ్తున్నారు. ఆమెను చివ‌రిసారిగా చూసి వ‌ద్దామ‌ని.. ఆమె అందం ఇక ఏనాటికి క‌నిపించ‌క‌పోవ‌డంతో ప్రేక్ష‌కాభిమానులు కూడా ముంబాయ్‌కి త‌ర‌లివెళ్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -