టాలీవుడ్ టాప్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున ఇప్పుడు సంక్రాంతి బరిలో పోటి పడబోతున్నారు. అక్కినేని, వెంకీ కాస్త వెనకడుగులో ఉన్నా…. ముందుగా చిరు-బాలయ్య పోటీ పడబోతున్నారు. ఈ ఇద్దరు బడా హీరోలు దాదాపుగా 11సార్లకు పైగానఏ పోటీ పడ్డారు.
అయితే అదే క్రమంలో కాస్త బాలయ్య చిరు పై పై చేయి సాధించిన సంధర్బలే ఎక్కువ అని చెప్పాలి. అయితే ఇలా ఈ ఇరువురూ బాక్స్ ఆఫీస్ వద్ద తమ సత్తా చాటిన సంధర్బాలు చూశాం…కానీ ఆ నలుగురు కలసి సంక్రాంతి బరిలో దిగిన సంధర్బాలు లేనే లేవు అనే చెప్పాలి. ఇప్పటివరకూ తెలుగు ప్రేక్షకులకు ఆ అవకాశం దక్కలేదు అనే చెప్పాలి…..ఇదిలా ఉంటే ఈ అవకాశం..ఆ ఆదృష్టం రానున్న సంక్రాంతికి మన ప్రేక్షకులకు తీరనుంది అని తెలుస్తుంది.
విషయంలోకి వెళ్తే.. ఈ సంక్రాంతి బరిలో టాప్ హీరోలు రచ్చ చేయడానికి సిధ్దం అవుతున్నారు. ఈ కోవలో.. చిరంజీవి 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150తో బరిలో దిగుతూ ఉండగా….బాలయ్య అమరావతి వైభవాన్ని…..చాటి చెప్పే విధంగా “గౌతమిపుత్ర శాతకర్ణి”గా రంగంలోకి దిగుతున్నాడు. ఇక వెంకీ “గురు” అనే సినిమాతో వస్తుండగా.. నాగ్ మాత్రం ఓం నమో వెంకటేశాయ అనే సినిమాతో రాబోతున్నారు. మరి ఈ సంక్రాంతి బరిలో ఎవరు పై చేయి సాధిస్తారో తెలియాలి అంటే సంక్రాంతి వరకు ఆగాల్సిందే.
Related