- టచ్ చేసి చూడు ట్రైలర్ విడుదల
పోలీస్ పాత్ర అంటే సీరియస్గా ఉండి సిన్సియర్గా డ్యూటీ చేయాలి. అదే రవితేజ ఆ పాత్రలో ఉంటే కామెడీతో పాటు సిన్సియర్గా డ్యూటీ చేస్తూ నేరస్తుల ఆటకట్టడంలో అతడి స్టైలే వేరు. రవితేజ పోలీస్ పాత్రలో విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో వస్తున్న సినిమా `టచ్ చేసి చూడు`. ఈ సినిమా టీజర్ను ఇటీవల విడుదల కాగా ఇప్పుడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం (జనవరి 25)న ట్రైలర్ను విడుదల చేశారు.
రాశీఖన్నా, సీరత్ కపూర్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ ఇచ్చింది. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నల్లమలపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జనవరి 26వ తేదీ రవితేజ జన్మదినం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమా ఫిబ్రవరి 2వ తేదీన విడుదల కానుంది.
ట్రైలర్ చూస్తుంటే రవితేజకు మరో విక్రమార్కుడు సినిమా అయ్యేటట్టు కనిపిస్తోంది. అదే ఎనర్జిటిక్ యాక్టింగ్తో రవిజేత విలన్లను కొడుతూ నన్ను టచ్ చేసి చూడు అని నేరస్తులను, విలన్లకు సవాల్ విసురుతున్నాడు. రాజా ది గ్రేట్ సినిమా తర్వాత రవితేజ చేస్తున్నాడు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆశిద్దాం.! ఈ సందర్భంగా ఆద్య మీడియా రవితేజకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది.