Monday, May 20, 2024
- Advertisement -

ఎన్టీఆర్ మూవీకి సంబంధించిన రూమ‌ర్ల‌కు చెక్ పెట్టిన త్రివిక్రమ్…

- Advertisement -

ప్ర‌స్తుతం అజ్ఞాతవాసి’ సినిమా తో బిజీపనుల్లో త్రివిక్ర‌మ్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.  జై లవ కుశ సినిమాతో మరో సూపర్‌ హిట్‌ అందుకున్న యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, తన నెక్ట్స్‌ సినిమాను త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నటించనున్నాడు. ఇటీవల పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా కథపై కొద్ది రోజులు ఆసక్తిరమైన వార్తలు వినిపిస్తున్నాయి.

రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమాలను కూడా జరుపుకుంది. జనవరి నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అంటున్నారు. ఈ నేపథ్యంలో .. 80 దశకంలో వచ్చిన ఓ పాప్యులర్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందనే టాక్ వచ్చింది. ఆ నవలను సినిమాగా తీయడానికి అవసరమైన రైట్స్ ను, భారీ మొత్తమే చెల్లించి త్రివిక్రమ్ సొంతం చేసుకున్నాడనే ప్రచారం జరుగుతోంది. అయితె ఈ రూమ‌ర్ల‌పై త్రిక్ర‌మ్ క్లారిటి ఇచ్చారు.

ఈ రోజు పుట్టిన రోజు వేడుక జరుపుకుంటోన్న త్రివిక్రమ్ ఈ విషయంపై స్పందించారు. ఎన్టీఆర్ తో తాను చేయనున్న సినిమా ఓ నవల ఆధారంగా తెరకెక్కనుందనే విషయంలో ఎంతమాత్రం నిజం లేదని ఆయన చెప్పారు. తన గత చిత్రాల మాదిరిగానే కుటుంబ సభ్యులంతా కలిసి చూసేలా ఈ సినిమా వుంటుందనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. ఇక ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం ‘టబు’ ఖరారైపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -