- Advertisement -
విజయ్ దేవరకొండ ,రష్మీక హీరో,హీరోయిన్లుగా నటించిన సినిమా గీతా గోవిందం.ఆగస్టు 15న విడుదలైన ఈ సినిమా యూత్ను బాగా ఆకట్టుకుంటుంది.విడుదలైన రోజునే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా, తొలిరోజునే 16.40 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి, ఈ ఏడాదిలో భారీ ఓపెనింగ్స్ ను రాబట్టిన టాప్ టెన్ చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకుంది.
ఇక 50 కోట్ల క్లబ్లో చేరినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో తన జోరు చూపిస్తోంది. తొలి 5 రోజుల్లో ఈ సినిమా 55 కోట్ల గ్రాస్ ను .. 31కోట్ల షేర్ ను సాధించింది. యూత్ కి కావలసిన అంశాలు పుష్కలంగా ఉండటం వల్లనే థియేటర్ల హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను బన్నీవాసు నిర్మించారు.