అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారాడు విజయ్ దేవరకొండ. తాజాగా విజయ్ నటించిన గీతా గోవిందం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 100 కోట్ల క్లబ్లో చేరిందని చిత్ర నిర్మాతలు ప్రకటించారు. దీంతో విజయ్ దేవరకొండకు బాగా డిమాండ్ ఏర్పడింది. విజయ్ కూడా తన రెమ్యునరేషన్ బాగా పెంచేశాడని తెలుస్తుంది. అయితే తమిళ స్టార్ డైరక్టెర్ మణిరత్నం సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పడట విజయ్. మణిరత్నం ఇప్పుడు మల్టీస్టారర్ ‘చెక్క చైవంత వానమ్ అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.
అరవింద్ స్వామి, అరుణ్ విజయ్, శింబు, విజయ్ సేతుపతిలు ప్రధాన పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో జ్యోతిక, అదితి రావు హైదరి హీరోయిన్లుగా కనిపించనున్నారు. అయితే ఈ సినిమాలో ఓ పాత్ర కోసం విజయ్ దేవరకొండని సంప్రదించారట. కానీ ఆ ఆఫర్ ని రిజక్ట్ చేశాడు విజయ్. విజయ్ దేవరకొండ నో చెప్పడం వెనుక కొన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. రెమ్యునరేషన్ తక్కువగా ఆఫర్ చేయడం, నలుగురు హీరోల్లో తాను ఒకడిగా కనిపించడం ఇష్టంలేకపోవడంతో ఆఫర్ ని రిజక్ట్ చేసినట్లు తెలుస్తోంది.