Friday, May 17, 2024
- Advertisement -

ఫిల్మ్‌ఫేర్‌‌ అవార్డు వేలం వేస్తా.. రా కుర్చుని మాట్లాడుకుందాం!

- Advertisement -

స్టార్ హీరోల‌ను కాద‌ని ఈ సంవ‌త్స‌రం ఫిల్మ్‌ఫేర్ అవార్డు గెలుచుకున్నాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌.అర్జున్ రెడ్డి సినిమాగాను బెస్ట్ యాక్ట‌ర్ అవార్డు గెలుచుకున్నాడు.ఈ అవార్డు రేసులో చిరంజీవి,బాల‌కృష్ణ‌,ప్ర‌భాస్ వంటి హీరోలు ఉన్న ఉత్తమ నటుడి అవార్డు విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే వ‌రించింది.అయితే ఫిల్మ్‌ఫేర్ అవార్డును వేలం వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించాడు విజ‌య్. తన తొలి అవార్డు వేలంలో అమ్ముడుపోతే ఆ డబ్బును సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇచ్చేస్తానని, ప్రజల్లోనూ అవగాహన వస్తుందని పేర్కొన్నాడు.

అయితే దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. విజ‌య్ దేవ‌ర‌కొండ చేసిన ట్విట్‌పై కేటీఆర్ హర్షం చేశారు. తొలి ఫిల్మ్‌ఫేర్ సాధించినందుకు అభినందనలు తెలిపుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్‌కి ఆయన సాయం చేయాలని అనుకోవడం ఆనందంగా ఉందని, ఆయన చొరవను అభినందిస్తున్నానని తెలిపారు. ఈ విషయంలో ఏం చేయాలో మాట్లాడదామని అన్నారు.

 

 

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -