హాస్య నటుడిగా ఎదిగిన సప్తగిరి హీరోగాను తన ప్రతిభను చూపుతున్నాడు. విభిన్న కథాంశాలతో సప్తగిరి అనే సిరీస్ను కొనసాగిస్తున్నాడు. సప్తగిరి ఎల్ఎల్బీ సినిమాతో మరో విజయం అందుకున్న సప్తగిరి మరో సినిమా హీరోగా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే సప్తగిరి కోసం కథ రాస్తున్నది ఎవరో వింటే షాకవుతారు.
తెలుగు, తమిళ్, హిందీ సినీ పరిశ్రమలో అతడు అందించిన కథలు సినిమాలుగా సూపర్ హిట్గా నిలిచాయి. ఆ రచయిత విజయేంద్ర ప్రసాద్. బాహుబలి, భజరంగీ బాయ్జాన్లాంటి సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విజయేంద్ర ప్రసాద్ సప్తగిరి కోసం ఓ హాస్య కథను రాయడంలో బిజీగా ఉన్నారని సమాచారం. తన బిజీ షెడ్యూల్లోనూ కామెడీ స్టార్ సప్తగిరి సినిమాకు కథ అందించనుండడం ఆశ్చర్యమే. సప్తగిరి హీరోగా రూపొందించే సినిమాకు స్వర్ణ సుబ్బారావు దర్శకత్వం వహించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చర్చల దశలో ఉంది. అయితే ఈ విషయంలో త్వరలో వాస్తవం తెలిసే అవకాశం ఉంది.