హాస్యభరిత నేపథ్యంలో వస్తున్న సినిమా ఆచారి అమెరికా యాత్ర. మంచు విష్ణు హీరోగా జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో కామెడీ, యాక్షన్ ఎంటర్టైనర్ ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలో బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, అనూప్ సింగ్ థాకూర్ విలన్గా నటిస్తున్నారు. పద్మజ పిక్చర్స్ బ్యానర్పై కీర్తీ చౌదరి, కిట్టులు నిర్మిస్తున్నారు.
విడుదల చేసిన ఈ సినిమా టీజర్ ఆకట్టుకోగా ఇప్పుడు ట్రైలర్ను విడుదల చేశారు. కామెడీ, రొమాన్స్, యాక్షన్ లతో రూపొందించిన ఈ సినిమా మంచు విష్ణు, జి.నాగేశ్వర్రెడ్డిలకు హ్యాట్రిక్ సక్సెస్ అందిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్.
ఖండాంతరాలు దాటి అమెరికాకు వెళ్లిన బ్రహ్మణులు ఏం చేశారు? అమెరికాకు ఎందుకు వెళ్లారు? అనే నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని ట్రైలర్ను చూస్తుంటే తెలుస్తోంది. ఈ సినిమాలో హాస్యంతో మంచి యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయి. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26వ తేదీన సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్ఎస్ థమన్ అందిస్తున్నారు.