Saturday, May 4, 2024
- Advertisement -

రోజుకు 18 గంటలు కష్టపడ్డాం: రాశీఖన్నా

- Advertisement -

టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న నటి రాశీఖన్నా ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈమె అక్కినేని నాగచైతన్య సరసన “థాంక్యూ” సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కరోనా విపత్కర సమయంలో కూడా ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఇటలీలో ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకొని ఇండియాకు వచ్చిన రాశీఖన్నా ఈ సినిమా షూటింగ్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.

దేశ వ్యాప్తంగా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం మొత్తం ఇటలీలో ఉన్నప్పటికీ తన ఆలోచనలన్నీ ఇండియా వైపే ఉండేవని తెలిపారు. ఈ క్రమంలోనే ఎన్నో సవాళ్ళ మధ్య ఇటలీలో షూటింగ్ జరిపామని తెలియజేశారు. షూటింగ్ సమయంలో మేము భారతీయులమని తెలియడంతో ఎన్నో ప్రాంతాలలో షూటింగుకు నిరాకరించారని, ఈ క్రమంలోనే రోజుకు 18 గంటలు షూటింగ్లో కష్టపడాల్సి వచ్చిందని ఈ ముద్దుగుమ్మ తెలిపారు.

Also read:ఆది పురుష్ చిత్రంలోని కీలక పాత్ర పై స్పందించిన బిగ్ బాస్ విన్నర్?

కరోనా పరిస్థితులు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఇటలీలో మాకు కావలసిన అన్ని సౌకర్యాలు లభించలేదు. అయినప్పటికీ ఎంతో సంతోషంగా షూటింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఇండియాకు వచ్చామని తెలిపారు. ఇప్పటివరకు తాను నటించిన సినిమాలన్నీ కామెడీ తరహాలోనే తెరకెక్కినప్పటికి తనకి ఎంతో మంచి గుర్తింపును సంపాదించాయని, థాంక్యూ సినిమాలో మాత్రం తన పాత్ర భిన్నంగా ఉంటుందని రాశీఖన్నా తెలిపారు.

Also read:నటుడు సోనుసూద్ కి నోటీసులు జారీ చేసిన ముంబై హైకోర్టు?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -