తాజాగా.. బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య పంచోలి భార్య జరీనా వాహబ్ చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నా భర్తతో డేటింగ్ చేసింది.. ఆమెను కుమార్తె అని ఎలా అనుకోమంటారు అని వ్యాఖ్యానించింది. ఇటివలే ఓ టీవీ ఛానల్కు బాలీవుడ్ హాట్ హీరోయిన్ కంగనా రనౌత్ ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బాలీవుడ్ డైరెక్టర్ ఆదిత్య పంచోలిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.
పంచోలి తనను తీవ్రంగా హింసిందారని.. కూతురు కంటే చిన్న వయసున్న తనను రక్తం వచ్చేలా హింసించారని ఆరోపించింది. దాంతో తాను ఆదిత్య భార్య జరీనా హెల్ప్ కోసం వెళ్లానని.. ఆమె కూడా సహకరించలేదని తెలిపింది. కంగనా చేసిన ఆరోపణలపై ఆదిత్య పంచోలీ భార్య జరీనా స్పందించారు. నా భర్త ఆదిత్యతో కంగనా నాలుగున్నర సంవత్సరాలు డేటింగ్ చేసిందని.. అలాంటపుడు ఆమెను కూతురుగా ఎలా ట్రీట్ చేస్తామని ప్రశ్నించింది.
తన అప్ కమింగ్ మూవీ సిమ్రన్ పబ్లిసిటీ కోసమే కంగనా ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడుతోంది. అయినా ఎప్పుడో జరిగినట్టు చెబుతున్న విషయాలను ఇప్పుడు తెరపైకి తీసుకురావడమేంటని, ఇది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని ఆమె అభిప్రాయపడింది.