Monday, April 29, 2024
- Advertisement -

యాత్ర 2..సోనియాను అచ్చుగుద్దినట్లు దింపేశాడు!

- Advertisement -

వైఎస్ రాజశేఖర్ రెడ్డి..ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో చెరగని ముద్రవేశారు. పాదయాత్రతో తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయారు వైఎస్. మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తన పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను చూసిన వైఎస్…ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చారు. ఇక వైఎస్ మరణం తర్వాత జగన్ సైతం పాదయాత్రతోనే ప్రజలకు దగ్గరయ్యారు.

ఇక 2019 ఎన్నికలకు ముందు వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో వచ్చిన యాత్ర సినిమా బ్లాక్ బాస్టర్ హిట్‌గా నిలిచింది. మహి వి రాఘవన్ తెరకెక్కించిన ఈ చిత్రం జగన్‌ను అధికారంలోకి తీసుకురావడానికి తోడ్పడిందనే చెప్పాలి. తాజాగా ఇప్పుడు 2024 ఎన్నికలకు ముందు అంటే 2024 ఫిబ్రవరి 8న విడుదల కానుంది.

ఇక యాత్ర 2లో ఆనాటి కాంగ్రెస్ పెద్దలు కూడా ఉన్నారు. ప్రధానంగా సోనియా గాంధీ పాత్ర కూడా ఉండటంతో ఆమె క్యారెక్టర్‌ని అచ్చుగుద్దినట్లు దింపేశాడు దర్శకుడు మహి వి రాఘవన్. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటోంది. ఇక చంద్రబాబు పాత్రలో మహేష్ మంజ్రేకర్ నటిస్తుండగా వైఎస్ పాత్రలో మమ్ముట్టి, జగన్ పాత్రలో జీవా నటిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -