Sunday, May 19, 2024
- Advertisement -

‘సాహో’ తో ప్రభాస్ లెక్కలు మారనున్నాయా?

- Advertisement -

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాల విషయం లో ఈ మధ్య ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడో పక్కన పెడితే సినిమా విడుదల విషయంలో బాగా ఆలస్యం చేస్తుండటంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయాలన్న ప్లాన్ తో ప్రభాస్ సినిమా కి రెండు మూడేళ్లు చేస్తుండడంతో స్పీడ్ తగ్గిపోతోందని అభిమానులు చాలా నిరాశ పడుతున్నారు. కానీ ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ప్యాన్ ఇండియన్ సినిమాలు చేయడం వైపే మొగ్గు చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాహుబలి పూర్తయిన వెంటనే సుజిత్ దర్శకత్వం లో ‘సాహో’ సినిమా ని లైన్ లో పెట్టేసాడు.

స్పై యాక్షన్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా షూటింగ్ కోసం ప్రభాస్ ఏకంగా రెండు కష్టపడ్డాడు. ఈ సినిమా ఈ నెల 30వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా తరువాత ప్రభాస్ రాధా కృష్ణ దర్శకత్వంలో ‘జాను’ అనే ప్రేమ కథ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని కూడా భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నారు అని సమాచారం. ఇంకా ఈ సినిమాకి రిలీజ్ తేదీని ప్రకటించలేదు. ప్రస్తుతం ‘సాహో’ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమా విడుదలైన తరువాత మరో సినిమాపై దృష్టి పెట్టానున్నాడట. ఒక వేళ ‘సాహో’ గనుక ‘బాహుబలి’ రేంజ్ లో బ్లాక్ బస్టర్ అయితే ప్రభాస్ కేవలం పెద్ద సినిమాల మీద మాత్రమే దృష్టి పెడతారని తెలుస్తోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -